24, మే 2014, శనివారం

Chennai Temples




                   శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం 

తమిళ నాడు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఆలయాలకు ప్రసిద్ది. 
అందులో శ్రీ పార్ధ సారధి స్వామి ఆలయం ఉన్న త్రిప్లికేనే ప్రాంతం ఎన్నో చిన్నా పెద్ద ఆలయాలకు నిలయం. 
ఏంతో పౌరాణిక చారిత్రాత్మిక విశేషాల సమాహారమైన శ్రీ పార్ధసారధి స్వామి ఆలయ పుష్కరణి కి దక్షిణాన ఉన్న హనుమంత రాయ కోవిల్ వీధిలో ఒక విశేష ఆంజనేయ ఆలయం ఉన్నది. 
అదే శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయం. 



గృహ సముదాయాల మధ్యన ఉన్న ఈ మందిరం లోని ఆంజనేయుని 1794వ సంవత్సరంలో అప్పటి ఉత్తరాది మఠం పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సత్య సందారు స్వామి ప్రతిష్టించారు. 






కాలక్రమంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత రూపం సంతరించుకొన్నది. 


గర్భాలయంలో ఎత్తైన గట్టు మీద సుమారు పది అంగుళాల శ్రీ భక్త ఆంజనేయ స్వామి విగ్రహం కుడి కాలుని కొద్దిగా వంచి ఉత్తరాభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తుంది.  
 సన్నటి ప్రదక్షిణా పదంలో అష్ట దిక్కులా నాగ రూపాలను ఉంచారు.
ఇక్కడ  ఒక విశేష ప్రత్యేకత ఉన్నది.
ధ్యానం అంటే శ్వాసను క్రమబద్ధీకరించడం!
ప్రాణానికి ముఖ్యం శ్వాస.
ఎంతటి చెంచల మనస్కులకైనా ఈ మందిరంలో ధ్యానం మీద అమితమైన ఏకాగ్రత కుదురుతుంది.
ప్రతి నిత్యం ఉదయం మరియు సాయంత్రం  నియమంగా పుజాలు జరిగే ఇక్కడికి ఎందరో వచ్చికొద్ది సేపు ధ్యానం చేసుకొని ఆ తరువాతే  తమ దైనందిన కార్యక్రమాలో పాల్గొంటారు.
ఈ కారణంగా శ్రీ ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆలయంగా పెరోచ్చినది.
హనుమత్ జయంతి మరియు శ్రీ రామ నవమి విశేషంగా జరుపుతారు.
పుష్కరానికి నాలుగు వైపులా ఎన్నో హనుమత్ మందిరాలను సందర్శించుకొనవచ్చును.
శ్రీ ఆంజనేయం !!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...